Sai Dharam Tej New Movie : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏడాది విడుదలైన విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించటమే కాదు.. వంద కోట్ల హీరోగా మారారు ఈ మెగా క్యాంప్ హీరో. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్తో మన ముందుకు రానున్నారు. ఆ సినిమా ఏదో కాదు.. బ్రో. ఈ సినిమాలో మేనమామ పవన్ కళ్యాణ్తో కలిసి నటించారు. జూలై 28న ఈ చిత్రం రిలీజ్ అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది.
మరి బ్రో తర్వాత సాయిధరమ్ చేయబోయే సినిమా ఏంటనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయమొకటి తెలిసింది. అదేంటంటే.. టాలీవుడ్లో కమర్షియల డైరెక్టర్గా పేరున్న సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ అనే టైటిల్ను కూడా అనుకున్నారట దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పక్కా కమర్షియల్ ఫార్మేట్లోనే ఈసినిమాను సంపత్ నంది రూపొందించనున్నారు.
సంపత్ నంది సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. సాయిధరమ్ తేజ్ సినిమాలోనూ అదే పంథాలో ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు. అందులో మెయిన్ హీరోయిన్ కోసం ఇద్దరు హీరోయిన్స్తో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారట. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరేమో శ్రీలీల.. మరొకరు పూజా హెగ్డే. ఇద్దరు బిజీ హీరోయిన్సే. అయితే ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె కంటే పూజా హెగ్డేనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి రెండో హీరోయిన్గా ఎవరు కనిపిస్తారనే ఇప్పటికైతే సస్పెన్స్. జూలై నుంచే సినిమా సెట్స్ పైకి వెళుతుందని కూడా అంటున్నారు మరి.