Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మీక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు నేషనల్ క్రష్ అనే పేరును అందుకుంది.. ప్రస్తుతం బీటౌన్ లో తన హవాను కొనసాగిస్తుంది.. అయితే చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. అభిమానులతో చిట్ చాట్ చెయ్యడమే కాదు.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.. తాజాగా క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఈ అమ్మడు క్రేజ్ ఇప్పుడు ఓ రేంజులో ఉంది.. బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. ఆ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.. ఆ తర్వాత మరో సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. అలాగే బాలీవుడ్ లో మరో సినిమాలో నటిస్తుంది… విక్కీ కౌశల్ జోడిగా నటిస్తుంది.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ధనుష్ కుబేర సినిమాలో కూడా నటిస్తుంది.. తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తుంది.. వీటితో పాటుగా ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో అనే సినిమాల్లో కూడా నటిస్తుంది..
ఈ అమ్మడు చేతిలో అర డజనుకి పైగా సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటుందో నిత్యం చూస్తూనే ఉంటాం.. ఈ అమ్మడు పెట్టిన ఫోటోలు క్షణాల్లో ఎంత వైరల్ అవుతుంటాయో.. తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేకాదు కొచ్చి లో ఉన్నట్లు రాసుకొచ్చింది. ఫోటోలు వైరల్ అవ్వడంతో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒంటరిగానే వెళ్ళావా లేదా పక్కన ఎవరైనా ఉన్నారా? నిజంగా ఒక్కదానివే వెళ్ళావ్ అంటే నమ్మాలని లేదు అంటూ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను ట్రెండ్ అయ్యేలా చూస్తున్నారు.. ఇక ఈ అమ్మడు పుష్ప 2 సినిమాలో నటిస్తుంది.. డిసెంబర్ లో మూవీ రిలీజ్ కాబోతుంది. అదే రోజున ఆమె నటించిన చావా మూవీ కూడా రిలీజ్ కాబోతుంది.
View this post on Instagram