Rajanikanth : కడప పెద్ద దర్గాను సూపర్ స్టార్ రజినీకాంత్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె ఐశ్యర్య, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దర్గాను సందర్శించారు. ఆస్థాన గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతి నుంచి కడపకు ప్రత్యేక విమానంలో స్టార్స్ వచ్చారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన దర్గాకి వెళ్లి దర్శించుకున్నారు.
పెద్ద స్టార్స్ రాక దృష్ట్యా దర్గా పరిసర ప్రాంతాల్లో భార బందోబస్తు ఏర్పాటు చేశారు. రజినీకాంత్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.