Rajamouli Comments:మినిమం బడ్జెట్తో రూపొంది పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం కాంతార. రూ.16 కోట్లతో కాంతార సినిమాను తెరకెక్కిస్తే .. ఏకంగా రూ.400 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ కాంతార సక్సెస్పై ఆశ్చర్యపోయారు. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రాజమౌళి ఏమన్నారో తెలుసా! ‘‘కాంతార సినిమా నా మైండ్ సెట్ను పూర్తిగా మార్చేసింది. బిగ్ స్టార్స్తో బిగ్ బడ్జెట్ ఖర్చు పెడితే భారీ కలెక్షన్స్ వస్తాయనుకుంటే పొరపాటే. ఇప్పటి మేకర్స్ అందరం కాంతార సినిమాతో ఓ సారి సినిమాలపై వెనుదిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అన్నారు.
ఎవరో సినిమాలపై కాకుండా తన సినిమాలపైనే రాజమౌళి ఇలా కామెంట్స్ చేసుకోవటం అనేది నిజంగా గొప్ప విషయం. ఆయన చెప్పిన మాటల్లోనూ నిజం లేకపోలేదు. కర్ణాటకలోని భూత కోలా సంస్కృతి, సంప్రదాయాలపై రూపొందిన కాంతార సినిమాను హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. కాంతార సినిమా విడుదల తర్వాత భూత కోలా కళాకారులకు కర్ణాటక ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటానికి అంగీకరించిందంటే సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవచ్చు. కాంతార సీక్వెల్గా కాంతార 2 రూపొందే అవకాశం ఉందని రిషబ్ ఓ సందర్భంలో తెలిపారు.