Prabhas Rebel Heroine Deeksha Seth update(Tollywood news): టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లపూడి డైరెక్షన్లో వచ్చిన మూవీ వేదం. ఈ మూవీలో హీరోలు బన్నీ, మంచుమనోజ్, హీరోయిన్ అనుష్క వంటి అగ్రతారలు ఇందులో యాక్ట్ చేశారు.ఈ మూవీలో అల్లు అర్జున్ సాధారణ కేబుల్ రాజుగా తన నటన అద్భుతం అనే చెప్పాలి.మీకు గుర్తుందా.. ఇందులో అల్లు అర్జున్ లవర్గా దీక్షాసేత్ చేసింది.ఇందులో ఓ రిచ్ గర్ల్గా చేసింది. తన కోసం బన్నీ పడరాని పాట్లు పడుతాడు.ఈ మూవీలో తన యాక్టింగ్ అద్భుతం అనే చెప్పాలి. ఎవరికి వారే యాక్టింగ్ని ఇరగదీశారు. ఇక కామెడీ కింగ్ బ్రహ్మీ కామెడీ ఇందులో హైలైట్ అనే చెప్పాలి. ఎందుకంటే ట్రైన్లో అనుష్కతో ఉండే సీన్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఆ తరువాత కొన్ని సినిమాలు చేసి సైడ్ అయిపోయి అమెరికాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది.
వృత్తిరిత్యా తన తండ్రి ఐటీసీలో ఉద్యోగం చేసేవాడు. తరుచుగా ట్రాన్స్ఫర్ అవడంతో చిన్నప్పటి నుండి మెట్రో నగరాల లాంటి ప్రాంతాలను చుట్టేసింది. ఇక తన స్కూలింగ్ అంతా చెన్నైలోనే కంప్లీట్ చేసింది. ఆ తరువాత మోడలింగ్ వైపు తన రూట్ మార్చుకుంది. ఆ తరువాత మోడలింగ్ చేస్తూ ఉన్న టైమ్లో డైరెక్టర్ క్రిష్ కంట్లో పడింది. దాంతో వేదం మూవీలో ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. ఆడిషన్స్కి వచ్చిన 75 మందిలో ఈవిడను మాత్రమే ఫైనల్ చేశాడట క్రిష్. ఇక ఆ తరువాత మాస్ మహారాజ్ రవితేజతో మిరపకాయ్, గోపిచంద్తో నిప్పు వంటి మూవీస్లో యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది.
Also Read: మూవీ పోస్టర్తో భయపెడుతున్న అశ్విన్ బాబు
ఆ తరువాత ప్రభాస్తో రెబల్ మూవీ చేసి టాలీవుడ్కి బైబై చెప్పేసి.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. దర్శన్తో జగ్గుదాదా మూవీలో నటించింది. హిందీలో వచ్చిన సాద్ కదమ్ మూవీ అనంతరం ఆమె ఎందులోనూ నటించలేదు. సీన్ కట్ చేస్తే ఓ బిజినెస్ మ్యాన్ని మ్యారేజ్ చేసుకొని యూకేలో సెటిల్ అయింది. అయితే ఈ అమ్మడి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి కాగానే ముసలావిడ లాగా మారిపోయిందని, మరికొందరు అలా ఉండటం వేరే దేశాల్లో కామన్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు.
View this post on Instagram