Poonam Kaur: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ హీరోయిన్ పూనమ్ కౌర్. సినిమాలతో రాని క్రేజ్ను వివాదాలతో తెచ్చుకుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయంపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా పూనమ్ ఎమోషనల్ అయింది. కన్నీరుపెట్టుకుంది. ఇంతకీ ఎందుకంటే..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి పూనమ్ హాజరైంది. ఈ కార్యక్రమంలో ఎమోషనల్ కామెంట్లు చేసింది పూనమ్. తాను తెలంగాణ బిడ్డనని.. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగానని కంటతడి పెట్టుకుంది. సినీ ఇండస్ట్రీలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మైనారిటీ అని, సిక్కు అని.. తనను వేరు చేసి చూడకండి అంటూ వ్యాఖ్యానించింది.
అలాగే ఇటీవల మరణించిన మెడికో ప్రీతిని తలచకుంటూ భావోద్వేగానికి గురైంది. ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంది. ప్రస్తుతం పూనమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.