Pooja Hegde: టాలీవుడ్ టాల్ బ్యూటీ పూజా హెగ్డేకు తాజాగా ఓ భారీ ఆఫర్ వచ్చినట్టే వచ్చి.. చేజారిపోయింది. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి చేతికి వచ్చిన ఆఫర్ను పూజా చేజార్చుకుంది. అయితే మరి ఆ భారీ ఆఫర్ ఎవరు ఇచ్చారు? ఆమె ఎంత డిమాండ్ చేసింది? అన్న విషయానికొస్తే..
టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రమూ బాగాలేదు. ఆమె గత కొంతకాలంగా నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్గా నిలిచాయి. ఇక తన లక్ పరీక్షించుకోవడం కోసం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. ఏ ప్రయోజనమూ లేకపోయింది. ముందుగా ‘ఆచార్య’ సినిమాతో పూజా బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రభాస్తో ‘రాధేశ్యామ్’, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’లో నటించినా ఈ అమ్మడుకి ఎక్కడా కలిసిరాలేదు. ఇలా వరుస డిజాస్టర్లు అందుకున్న తర్వాత ఆమెకున్న క్రేజ్ పడిపోతూ వచ్చింది.
అయితే ఈ ముద్దుగుమ్మ ఫామ్ కోల్పోయినప్పటికీ.. ఓ పెద్ద చిత్రం తన వద్దకు వచ్చిందని.. అయితే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి.. ఆ సినిమాను పూజా వదులుకుందని ఓ న్యూస్ బయటకొచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో ‘మిస్టర్ బచ్చన్’ అనే మూవీ రూపొందుతుంది. ఈ మూవీలో హీరోయిన్గా పూజ హెగ్డేను మేకర్స్ తీసుకోవాలనుకున్నారట.
దీంతో ఆమెను సంప్రదించగా.. ఆమె అడిగిన పారితోషికం విని ఒక్కసారిగా షాక్ అయ్యారట. పూజా ఈ మూవీలో నటించడానికి దాదాపు రూ.3 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో మేకర్స్ ఆమెను పక్కన పెట్టేసి.. మరో హీరోయిన్ కోసం వెతుక్కున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.