Pawan Kalyan with Trisha: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ.. ఈసారి ఎలాగైనా గెలవడానికి జనసేన ఎంతో కష్టపడుతుంది. ఆరోగ్యం సహకరించకపోయినా పవన్.. ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. ఇక ఎలక్షన్స్ అయ్యేవరకు సినిమాలను హోల్డ్ లో పెట్టిన పవన్.. నిన్న విశ్వంభర సెట్ లో ప్రత్యక్షమయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ కాంబోలో వస్తున్నా చిత్రం విశ్వంభర. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంభర సెట్ లో అన్న చిరును పవన్ కలిశాడు. జనసేనకు చిరు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఆ చెక్ తీసుకోవడానికి సెట్స్ కు వెళ్లిన పవన్.. చిత్ర బృందంతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇక అక్కడే త్రిషను కూడా పవన్ మీట్ అయ్యాడు. త్రిష, పవన్ కు పూల మొక్క ఇచ్చి ఆహ్వానం పలికింది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పవన్, త్రిష కలిసి తీన్ మార్ సినిమాలో నటించారు.
Also Read: Balakrishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది..
జయంత్ సి. పరాన్జే దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ లవ్ ఆజ్ కల్ కు రీమేక్. 2011 లో రిలీజ్ అయిన తీన్ మార్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది కానీ, మ్యూజిక్ పరంగా భారీ హిట్ ను అందుకుంది. ఇక మైకేల్ వేలాయుధంగా పవన్, మీరాగా త్రిష జంట ఎంతో చూడముచ్చటగా కనిపించారు. దాదాపు 14 ఏళ్ల తరువాత ఈ జంట ఇలా కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వీరి కాంబోలో ఒక సినిమా వస్తే బావుండు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.