Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్లలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా తర్వాత మరొక సినిమా ప్రకటిస్తూ పవన్ తమ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ సగానికి పైగా పూర్తి చేసుకుని ఇప్పుడు బ్రేక్ ఇచ్చాయి.
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పవన్ ఈ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఎలక్షన్స్ పూర్తి కాగానే తన లైనప్లలో ఉన్న సినిమాల షూటింగ్లలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ వార్త తెలిసి ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరికొందరేమో.. ఇప్పటి వరకు ఓపిక పట్టాం.. మరికొన్ని రోజులే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మూడు సినిమాల్లో పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఓజీ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ గ్లింప్స్తో ఫ్యాన్స్లో ఓ రకమైన ఉత్సాహం మొదలైంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకొని రిలీజ్ కాబోతుందని సినీ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.