Pawan Kalyan: ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య రాములవారి పేరే వినిపిస్తోంది. ఎప్పుడెప్పుడు రాముల వారిని దర్శించుకుందామా అని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా రేపు శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు అధిక సంఖ్యలొ ప్రజలు స్వామివారిని దర్శించుకోనున్నారు.
ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నేడు అయోధ్య మొత్తం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అయోధ్య రామ మందిరానికి రాజకీయ ప్రముఖులే కాదు.. సినీ ప్రముఖులు కూడా తమ వంతు సాయంగా భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన వంతు సాయంగా రూ.50 కోట్ల విరాళం ప్రకటించారు.
ఇప్పుడు అదే బాటలో మరో స్టార్ హీరో వచ్చి చేరారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయోధ్య రామ మందిరానికి రూ.30 లక్షలు ప్రకటించారు. తాజాగా ఆర్ఎస్ఎస్ ముఖ్యులు భరత్ జీ కి.. పవన్ రూ.30 లక్షల చెక్ను అందజేశారు. దీంతోపాటు పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కూడా రూ.11 వేలు విరాళంగా ఇచ్చారు. అలాగే ప్రజల నుంచి కూడా అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు అందుతున్నాయి.