Pathaan: మూడేళ్ల తర్వాత ‘పఠాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాలీవుడ్ను షేక్ చేస్తోంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.
అడ్వాన్స్ బుకింగ్స్తోనే రూ. 50 కోట్లు వసూల్ చేసిని ఈ మూవీ.. మొదటి రోజు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి మొదటి రోజు రూ. 50 కోట్లు వసూల్ చేసింది. దీంతో ‘కేజీఎఫ్-2’(హిందీ), ‘వార్’ మొదటి రోజు రికార్డులను బద్దలు కొట్టింది. అయితే లాంగ్ వీకెండ్ రావడంతో భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.