EPAPER
Kirrak Couples Episode 1

Parvathy Nair : తప్ప తాగి పనోడిపై దాడి… నిర్మాత, హీరోయిన్‌పై కేసు

Parvathy Nair : తప్ప తాగి పనోడిపై దాడి… నిర్మాత, హీరోయిన్‌పై కేసు

Parvathy Nair : కోలీవుడ్ హీరోయిన్ పార్వతి నాయర్ పై తాజాగా కేసు నమోదైంది. తప్ప తాగి పని మనిషిపై దాడి చేసిందంటూ ఫిర్యాదు దాఖలైంది. రెండేళ్ల క్రితమే పార్వతి ఈ కేసులో చిక్కుకుంది. తాజాగా ఆ కేసు మరోసారి తిరగ తోడుకుంటోంది. అసలు వివాదం ఏంటో తెలుసుకుందాం పదండి.


వివాదం ఏంటంటే? 

ఇంట్లో పని చేస్తున్న వ్యక్తిపై దాడి చేసినందుకు పార్వతి నాయర్‌, నిర్మాత కొడప్పాడి రాజేష్‌తో పాటు మరో 7 మందిపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిజానికి ఈ వివాదం రెండేళ్ల కిందటిది. మలయాళ నటి పార్వతి నాయర్ ఉత్తమ్ విలన్, మ్నీ ఐందాల్, కోటిట నాయుడుకుక, నిమిర్ వంటి తమిళ చిత్రాలలో నటించి హీరోయిన్ గా తమిళ మలయాళ పరిశ్రమలలో మంచి గుర్తింపు దక్కించుకుంది. 2022లో చెన్నైలోని నుంగంబాక్కంలోని తన ఇంట్లో 10 లక్షల విలువైన వాచీలు, ఐఫోన్, ల్యాప్‌టాప్ తదితర వస్తువులు మాయమైనట్లు నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఈ బ్యూటీ. అప్పుకర్‌లోని తన ఇంట్లో పనిచేసిన పుదుకోట్టై నివాసి సుభాష్ చంద్రబోస్ పై ఆ సమయంలో అనుమానం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఫైల్‌పై నటి బోస్, మిస్టర్ జార్జ్‌లపై ప్రైవేట్ ఫిర్యాదు చేసింది.


అదే సమయంలో దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సుభాష్ చంద్రబోస్ పార్వతి నాయర్‌తో సహా ఏడుగురిపై తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అఫిడవిట్‌లో పార్వతి నాయర్, 7 మందితో సహా వారు తనను తన ఇంట్లో బంధించారని, తనపై దాడి చేశారని చెప్పాడు ఆ పని మనిషి. హీరోయిన్ ఇంటికి వచ్చిన వ్యక్తులను తాను గమనించినప్పటి నుండి ఆమె తనను వేధింపులకు గురి చేసిందని, తనను చెంపదెబ్బ కొట్టిందని, తరచూ తన మీద ఉమ్మి వేసి మానసికంగా వేధించేదని కూడా చెప్పాడు. తనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తానని కూడా ఆమె బెదిరించిందని చెప్పి సుభాష్ షాక్ ఇచ్చాడు. సుభాష్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చెన్నైలోని సైదాపేట కోర్టులో కేసు వేశారు.

Actress Parvati Nair Latest Photos | Tamilstar

మరోసారి మెడకు చుట్టుకుంటున్న కేసు 

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జయచంద్రన్.. ఆగస్టు 29న సుభాష్ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడంతో, సుభాష్ ఈ వారం చెన్నై పోలీసు కమిషనర్‌ దగ్గరకు వెళ్ళి మళ్లీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పార్వతి నాయర్, కొడప్పాడి రాజేష్, అరుణ్ మురుగన్, ఇళంగోవన్, సెంథిల్, అజిత్ భాస్కర్ సహా ఏడుగురిపై 3 సెక్షన్ల కింద తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మరోసారి ఈ కేసు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో హీరోయిన్ పార్వతితో పాటు ఓ నిర్మాత, తదితరులు ఉండడం గమనార్హం. మరి ఇప్పటికైనా పోలీసులు పార్వతిపై చర్యలు తీసుకుంటారా ? అనేది చూడాలి.

Related News

Suchithra: ఆ లెజెండరీ డైరెక్టర్ పెద్ద కామ పిశాచి.. చచ్చే వరకు ఎవరిని వదలలేదు

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Rakesh Master: అందుకు జానీ కాలర్ పట్టుకున్నాను, తనలో ఆ క్వాలిటీ ఉంది.. రాకేష్ మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్

Jayam Ravi : ఆమెను మధ్యలో లాగకండి… సింగర్ తో ఎఫైర్ పై ఫస్ట్ టైం స్పందించిన జయం రవి

Devara : దేవర ప్లాప్ అయిన కొరటాల సేఫ్… ఇక్కడో ఓ లాజిక్ ఉంది..

Aishwarya Rajesh: బాధేస్తుంది.. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్తే అక్క‌డ జ‌రిగేది ఇదే: ఐశ్వ‌ర్య రాజేష్‌

Big Stories

×