Mahesh Babu : తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా కలెక్షన్స్ పరంగా భారీగా వసూల్ చేసుకున్నా కూడా కథ పరంగా అంతగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది. ఆ సినిమా తర్వాత రాజమౌలితో సినిమా చేసేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమాను అనౌన్స్ చేసి రెండేళ్లు అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడూ వెళ్తుందా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ సినిమా లో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది.
ఈ మూవీకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఇక రాజమౌళి తో సినిమా అంటే సంవత్సరాలపాటు హార్డ్ వర్క్ తప్పదన్న సంగతి అందరికీ తెలుసు. పిప్పి తీస్తాడు అని ఇప్పటికే చాలా మంది చెప్పారు. ఇక ఎన్టీఆర్ కూడా జక్కన్నతో సినిమా అంటే మాములుగా ఉండదు అని చెప్పాడట. ఈ వార్త వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్, మహేష్ కలిసి ఈ మూవీలో నటిస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీరిద్దరూ ఇండస్ట్రీలో అన్నదమ్ములుగా ఉంటారు. ఎప్పుడు కలిసిన వారి మధ్య ఏదో తెలియని బంధం లా ఫీల్ అవుతారు.. ఇక మరి కొంతమంది మాత్రం ఎన్టీఆర్, మహేష్ బాబు పాత వీడియోలను ట్యాగ్ చేస్తూ ఇద్దరు సినిమా చేస్తే థియేటర్లు చిరిగిపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా తో ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ గెస్ట్ గా మహేష్ బాబు రానున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ చేశారు. అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇక ఎన్టీఆర్ దేవర తర్వాత వార్ 2 బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే… దేవర సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతుంది.. ట్రిపుల్ ఆర్ తరువాత వస్తున్నా ఈ మూవీ పై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో మరి కొద్దీ రోజుల్లో తెలియనుంది.