Harikrishna: దివంగత నటుడు నందమూరి హరికృష్ణ తన నటన, డైలాగులతో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా.. ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు తరచూ బయటకు వస్తుంటాయి. ఈ తరుణంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పని చేసిన నరసయ్య తాజా ఇంటర్వ్యూలో నందమూరి హరికృష్ణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఎన్టీఆర్ కుమారులలో హరికృష్ణ చాలా సింపుల్గా ఉండేవారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో ఉండేటప్పుడు ఆయన చైతన్య రథానికి డ్రైవర్గా కూడా హరికృష్ణ పని చేశారు. ఎన్టీఆర్ కొడుకు అని కొంచెం కూడా గర్వం, అహంకారం ఉండేది కాదు. నిజమైన డ్రైవర్ లాగే బండి కింద పట్టా వేసుకొని పడుకునే వారు. దురదృష్టవశాత్తు ఆయనే సొంతంగా డ్రైవింగ్ చేస్తూ మరణించడం బాధాకరం అంటూ తెలిపారు. అలాగే తెలుగు దేశం పార్టీ గురించి కూడా మాట్లాడారు. టీడీపీలోకి నారా లోకేష్, జూ. ఎన్టీఆర్ లేదా మరెవరైనా రావచ్చు. ఇది రాజకీయం. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల పరంగా చాలా బిజీగా ఉన్నారు. లోకేష్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు.
ఇక ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లే నాయకులు అవుతారు అంటూ నరసయ్య చెప్పుకొచ్చారు. మరోవైపు ఆయన బిడ్డలుగా జన్మించిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లు కూడా ఆయనలాగే సింపుల్గా ఉంటారు. ఎవరితో కూడా తగాదాలకు వెళ్లరు. తమ పని తాము చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తానికి తన తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.