Pavitra Lokesh : సినీనటి పవిత్రా లోకేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు 8 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్స్కు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయిన పవిత్రా లోకేశ్ ఇటీవల సైబర్ క్రైమ్ను ఆశ్రయించారు.
తన పట్ల కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న ఆ యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియాలో పవిత్ర-నరేష్లపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్, వైబ్ సైట్ కు నోటీసులు జారీ చేశారు.