Nita Ambani: ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం రాత్రి జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో ముకేష్ అంబానీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు. ముఖ్యంగా నీతా అంబానీ తన డ్యాన్స్తో మరోసారి ఆకట్టుకున్నారు. రఘుపతి రాఘవ రాజారాం డివోషనల్ సాంగ్కు ఆమె నృత్యం చేశారు.
సంప్రదాయశైలిలో నీతా అంబానీ చేసిన డ్యాన్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ వేడుకకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి ఈవెంట్కు అటెండ్ అయ్యారు. అలాగే సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ, ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్, శ్రద్దాకపూర్, జాన్వీకపూర్ ,సోనమ్ కపూర్, రజినీకాంత్ ఈ వేడుకలో సందడి చేశారు.