Nikhil Siddhartha: సినిమాలో హీరోలు.. మంచి చేస్తే సూపర్ హీరో అంటారు. అదే హీరోలు బయట కూడా మంచి చేస్తే రియల్ హీరోలు అంటారు. తాజాగా కుర్ర హీరో నిఖిల్ రియల్ హీరోగా మారాడు. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం కార్తికేయ. అందులో హీరో.. మూసిఉన్న గుడి రహస్యం తెలుసుకొని.. చివరికి ఆ గుడిని తెరిపిస్తాడు. ఇప్పుడు నిఖిల్ అదే సీన్ ను బయట కూడా రీపీట్ చేశాడు.
అసలు విషయం ఏంటంటే.. ఏపీలోని చీరాలలో ఒక మూసి ఉన్న ఆలయాన్ని నిఖిల్ తెరిపించాడు. ఆలయ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కొన్నేళ్ల క్రితమే ఆ ఆలయాన్ని మూసేశారు. ఇక తాజాగా ఆ విషయం తెలుసుకున్న నిఖిల్ ఆలయాన్ని తెరిపించడమే కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. దీంతో గ్రామ ప్రజలు నిఖిల్ కు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపించారు. నిఖిల్ నడుస్తుండగా.. ఆయన పాదాలకు పూలు వేసి లోపలి ఆహ్వానించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను నిఖిల్ షేర్ చేస్తూ.. “గ్రామం మొత్తానికి శిక్షగా ఈ ఆలయాన్ని మూసివేశారు.. గత నెలలో దీనిని తెరిచాము… మా కుటుంబానికి మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు…అభివృద్ధి అందరికీ చేరేలా కృషి చేస్తాం” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈసారి ఎన్నికల్లో నిఖిల్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎం కొండయ్యకు మద్దతుగా నిఖిల్ ప్రచారం చేశాడు. ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచాడు. చీరాలలో అభివృద్ధి మును ముందు ఇంకా చూస్తారని నిఖిల్ ఇచ్చిన హామీని ఇలా నిలబెట్టుకున్నాడు. ఇకపొతేహ్ ప్రస్తుతం ఈ కుర్ర హీరో స్వయంభు సినిమాలో నటిస్తున్నాడు.