Manchu manoj on Ajay Sastry death(Latest news in tollywood): టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ శాస్త్రి మరణించారు. ఈ విషయాన్నీ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు. అజయ్ శాస్త్రి.. రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
డేంజర్, రాఖీ సినిమాలకు రైటర్ గా పనిచేసిన అజయ్.. మంచు మనోజ్ తో నేను మీకు తెలుసా అనే సినిమా తెరకెక్కించి దర్శకుడుగా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. అయినా మంచు మనోజ్ కెరీర్ లో నేను మీకు తెలుసా ఒక స్పెషల్ సినిమాగా మిగిలింది. ఇప్పటికీ ఆ సినిమా పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.
ఇక ఈ సినిమా తరువాత అజయ్ ఎక్కడా కనిపించలేదు. అవకాశాలు రాలేదో.. లేక ఇండస్ట్రీని వద్దు అనుకున్నాడో తెలియదు. ఇన్నేళ్ల తరువాత ఆయన మరణించిన వార్త మాత్రమే తెలిసింది. ” నా బెస్ట్ ఫ్రెండ్ మరియు నేను మీకు తెలుసా కెప్టెన్ ఇక లేరని తెలియజేయడానికి హృదయ విదారకంగా ఉంది. నేను పడుతున్న బాధను పదాలు వర్ణించలేవు.
ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ధైర్యాన్ని ప్రసాదించాలని శివుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి. నిన్ను కోల్పోతున్నాను రా అజయ్, చాలా త్వరగా వెళ్ళిపోయావు. ఇది ఒక కల అయితే బావుండని కోరుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు లేకుండా ఏది ఒకేలా ఉండదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను బాబాయ్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.
Heartbreaking to inform that my best friend and the Captain of Nenu Meeku Telusa is no more. No words can describe the pain we r enduring. Praying lord shiva to give strength to his family and loved ones. Om Shanti.
Will miss you ra Ajay, gone too soon. Wishing this is a dream.… pic.twitter.com/zxjPjdi2Tw— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 2, 2024