Nayanthara Connect Issue : లేడీ సూపర్స్టార్ నయనతారా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కనెక్ట్’. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. హారర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 23న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విడుదల సమయంలో సమస్య వచ్చింది. థియేటర్స్ ఓనర్స్ కనెక్ట్ సినిమాను విడుదల చేయటానికి ముందు ఆసక్తి చూపించలేదు. అందుకు కారణం.. సినిమా ఎలాంటి బ్రేక్ లేకపోవటమే. బ్రేక్ లేకపోవటానికి.. థియేటర్స్ యాజమాన్యం మూవీని రిలీజ్ చేయకపోవటానికి కారణమేంటనే సందేహం రాక మానదు.
దీనికి థియేటర్స్ ఓనర్స్ చెప్పేదేమంటే.. సినిమా బ్రేక్ సమయంలో ఆడియెన్స్ పాప్ కార్న్, కూల్ డ్రింక్ తదితర వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా థియేటర్స్కు కొంత ఆదాయం వస్తుందని. బ్రేక్ లేకపోతే ఆ ఆదాయం కూడా రాదు. కాబట్టి కనెక్ట్ సినిమాను విడుదల చేయటానికి మూవీ థియేటర్స్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. అయితే చివరకు ఈ సమస్యను చిత్ర యూనిట్ పరిష్కరించుకుంది. సినిమా వ్యవధి 99 నిమిషాలుండగా.. తొలి 59 నిమిషాల్లో బ్రేక్ ఇచ్చేలా నిర్ణయించుకున్నారు. దీంతో ఇష్యూ క్లియర్ అయ్యిందని సినీ సర్కిల్స్ అంటున్నారు.
2015లో విడుదలైన మాయ (మయూరి) సినిమా.. నయనతార, అశ్విన్ శరవణన్ కాంబినేషన్లో రూపొందింది. 8 ఏళ్ల తర్వాత మళ్లీ అదే కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇది.