Tarakaratna: అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఇంకా ఆయన ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో డాక్టర్లు అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తున్నారు. అయితే మెరుగైన విద్యం కోసం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు తారకరత్న కుటుంబ సభ్యులు వెల్లడించారు. హృద్రోగం, నాడీ సమస్యలకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
కొద్దిరోజుల క్రితం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే క్రమంగా ఆయన కోలుకుంటుండడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. వైద్యులనే విదేశాల నుంచి రప్పించి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోటుకుంటున్నారని, త్వరలోనే మామూలు మనిషి అవుతారని కటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేర్పించి… శుక్రవారం అర్ధరాత్రి వరకూ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తారకరత్న వెంట సతీమణి అలేఖ్యరెడ్డితో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారు.