Nandamuri Mokshagna : నటసింహ నందమూరి బాలకృష్ణ రానున్న సంక్రాంతికి వీర సింహా రెడ్డి చిత్రంతో థియేటర్స్లో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్, సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో అంశం నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా? అని . మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నెట్టింట చాలా వార్తలే వినిపిస్తున్నాయి. తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లి బాలయ్య అక్కడ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలో మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి క్లారిటీ ఇచ్చారు.
వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నారని బాలకృష్ణ తెలిపారు. అయితే దానికి దర్శకత్వం ఎవరు చేస్తారనేది ఆయన చెప్పలేదు. దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందని చెప్పారు. ఇదే సమయంలో అఖండ సీక్వెల్ గురించి ప్రశ్నిస్తే తప్పకుండా చేస్తామని.. సబ్ టైటిల్స్తో సహా లాక్ చేసి ఉంచాం. అయితే ఎప్పుడు చేయాలనేదే చూడాలి అని అన్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న వీరసింహా రెడ్డి షూటింగ్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. సంక్రాంతి బరిలోకి దిగుతుంది. దీని తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తున్నారు బాలయ్య. మరో వైపు బోయపాటి శ్రీను దర్శకుడిగా రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాలను కంప్లీట్ చేసుకున్న తర్వాతే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా ఉంటుంది.