Naga Chaitanya latest news(Tollywood news in telugu):
కస్టడీ మూవీ తర్వాత నాగచైతన్య మరో మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం NC23 గానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. చందు మొండేటి డైరెక్షన్ లో తరికెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో విడుదల అవుతుంది. ఈ హై యాక్షన్ మూవీ శ్రీకాకుళంలో మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. అక్కడి మత్స్యకారుల నిజ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. డాక్టర్ యాక్టర్ సాయి పల్లవి మరోసారి నాగచైతన్య తో జతకట్టనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం నాగచైతన్య స్పై ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా తో ఓటీటీపై ప్రత్యక్షం కాబోతున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్లు ప్రస్తుతం ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్ లతో జోరు పెంచిన సంగతి తెలిసిందే. వెంకటేష్ దగ్గర నుంచి తమన్నా వరకు.. చాలామంది హీరో, హీరోయిన్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కూడా వారి అడుగుజాడల్లోనే నడవడానికి ప్రయత్నిస్తున్నాడు.
సినిమాల తో పాటు ఆన్లైన్లో కూడా తన లక్ ను పరీక్షించుకునేందుకు చైతూ.. ధూత అనే వెబ్ సిరీస్ తో డిసెంబర్ 1 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ వివిధ భారతీయ భాషలలో ప్రదర్శించబడుతుంది. నవంబర్ 21న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ధూత మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు టాక్. అయితే ఇంకా ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
శరత్ మరార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్ సిరీస్ లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్,ప్రాచీ దేశాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని అక్కినేని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.