Naga Chaitanya: అక్కినేని వంశం లో ఈ తరానికి నట వారసుడిగా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసిన నాగ చైతన్య మొదటి నుంచి తన కెరియర్ విషయంలో నానా అగచాట్లు పడుతున్నాడు. ఒకప్పుడు అగ్ర హీరోలు అంటే ఏఎన్ఆర్,ఆ తర్వాత జనరేషన్లో నాగార్జున తమ వంతు స్థానాన్ని నిలుపుకోగలిగారు. కానీ అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ సెకండ్ టైరు హీరోలుగా మిగిలారే తప్ప స్టార్ హీరోల స్టేటస్ కి చేరుకోలేకపోతున్నారు. నాగచైతన్య కనీసం అడపాదడపా హిట్ మూవీస్ తో కాస్త ఫామ్ లో ఉన్నాడు ..మరి అఖిల్ పరిస్థితి దారుణంగా తయారయింది.
రీసెంట్గా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన నాగచైతన్య కస్టడీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈసారి అయినా కమర్షియల్ హిట్ రాకపోతే ఇండస్ట్రీలో కనుమరుగైపోవడం కన్ఫామ్ అని భావించిన నాగచైతన్య ప్రస్తుతం తన రాబోయే చిత్రం కోసం కుస్తీలు పడుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య నెక్స్ట్ మూవీ రాబోతుంది.
ఈ చిత్రం రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా చిత్రీకరించబడుతుండట. ఇప్పటివరకు నాగచైతన్య 22 సినిమాలలో హీరోగా నటించాడు కానీ చెప్పుకో దగ్గ హిట్ అతని ఖాతాలో లేకపోవడం అక్కినేని ఫ్యాన్స్ ని ఎంతో నిరాశ పరుస్తోంది. కాబట్టి రాబోయే 23వ చిత్రంలో ఎలాగైనా సాలిడ్ కమర్షియల్ హిట్ కొట్టాలి అని నాగచైతన్య ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నవంబర్ లో మొదలుపెట్టడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం మత్స్యకారుల నేపథ్యంలో తెరకెక్కబోతోందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి రీసెర్చ్ వర్క్ కోసం శ్రీకాకుళం తో పాటు పరిసర ప్రాంతాలకు డైరెక్టర్ చందూ మొండేటితో పాటు హీరో నాగచైతన్య కూడా వెళ్లారట. ఇందులో నాగచైతన్య సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. అయితే చందూ మొండేటి డైరెక్షన్ లో సాయి పల్లవికి ఇది తొలి చిత్రం …కానీ తమాషా అయిన విషయం ఏమిటంటే సాయి పల్లవి
మలయాళంలో నటించిన ‘ప్రేమమ్’ మూవీ ను తెలుగులో నాగ చైతన్య తో రీమేక్ చేసిన డైరెక్టర్ చందూ మొండేటి.
ఇంతక ముందు సాయి పల్లవి.. నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టొరీ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది…మరో పక్క నాగచైతన్య…చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన ప్రేమమ్ నాగ చైతన్యకు మంచి పుష్ అప్ ఇచ్చింది….మరీ ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ వల్ల అయిన పాపం చైతు కి సక్సెస్ దక్కుతుందేమో చూద్దాం…