Raviteja Entered in Multiplex Business(Tollywood news in telugu): టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్లపై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో ఇప్పటికే మహేశ్ బాబు ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్, అల్లు అర్జున్ ఏఏఏ థియేటర్, విజయ్ దేవరకొండ ఏవీడీ థియేటర్ను రన్ చేస్తున్నారు.
కాగా మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ప్రముఖ ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో ఈ థియేటర్ల బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇదే కోవలోకి మరో టాలీవుడ్ స్టార్ హీరో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈ థియేటర్ల బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
హైదరాబాద్లోని దిల్షుక్నగర్లో ఓ మల్టీప్లెక్స్ను నిర్మించబోతున్నాడు. ఈ మల్టీప్లెక్స్కి ఏషియన్ రవితేజ పేర్లు కలిసి వచ్చేలా ఏఆర్టీ సినిమాస్ అనే పేరును పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్లో మొత్తం ఆరు స్క్రీన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Read More: ప్రభాస్కు జోడిగా మరోసారి జాతీయ ఉత్తమ నటి..!
కాగా దాదాపు ఈ ఏడాదిలోనే ఏషియన్ రవితేజ మల్టిప్లెక్స్ థియేటర్ స్టార్ట్ కాబోతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మాస్ మహారాజా రవితేజ త్వరలోనే అఫీషియల్గా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే రవితేజ ఇటీవల నటించిన సినిమా ‘ఈగల్’. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ అందుకుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ మాస్ లుక్లో కనిపించి కనువిందు చేశాడు. ఇక యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ 12 రోజుల్లో రూ.23.48 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.