EPAPER

Mr Perfect Re – Release: రకుల్ ప్రీత్ సింగ్ ను తీసేసి కాజల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది.?

Mr Perfect Re – Release: రకుల్ ప్రీత్ సింగ్ ను తీసేసి కాజల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది.?

Mr Perfect Re – Release: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు ఇప్పుడు ఎవరికి ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. కొంతవరకు షూటింగ్ జరిగి కూడా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. మరి కొన్నిసార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి తప్పిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ (Mr Perfect). ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించారు. ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా అద్భుతమైన హిట్ అయింది. ప్రభాస్ లాంటి హీరోతో ఇలాంటి క్లాస్ స్టోరీ కూడా చెప్పొచ్చు అని దశరథ్ ప్రూవ్ చేశాడు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. పెద్ద హీరోలు పుట్టినరోజులు వస్తున్నప్పుడు వాళ్ల కెరియర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేయడం అనేది కామన్ గా మారిపోయింది.


ఇక ప్రస్తుతం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాలో కాజల్ (Kajal) తాప్సీ (Tapsee) కీలక పాత్రలో కనిపించారు. మొదట కాజల్ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా అనుకున్నారట. ఒక నాలుగు రోజులు పాటు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా అయింది. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఒక పది రోజుల గ్యాప్ వచ్చింది. అప్పుడు ఈ ఫుటేజ్ చూసిన కొంతమంది కొత్త హీరోయిన్ కాకుండా తెలిసిన వారితో వెళితే బాగుంటుంది అని చెప్పడంతో రకుల్ ను ఈ సినిమా నుంచి తొలగించి రకుల్ (Rakul Preet) ప్లేసులో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు. ఈ సినిమాతో కాజల్ కి కూడా మంచి పేరు వచ్చింది. కాజల్ తన కెరీర్ లో చేసిన సినిమాలలో ఈ సినిమా మంచి ప్లస్ అయిందని చెప్పాలి. అలా తెలుగులో చేయాల్సిన మొదటి సినిమా రకుల్ చేయలేకపోయారు.

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన తర్వాత రకుల్ నటించిన ఒక కన్నడ సినిమా ఆడియో ఫంక్షన్ కి దశరథ్, ప్రభాస్ ఇద్దరు హాజరయ్యారు. అలానే సినిమా విషయంలో కూడా ఆవిడకి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా రకుల్ ఫాదర్ తో కూడా మాట్లాడినట్లు రివిల్ చేశాడు దర్శకుడు దశరథ్. ఇక మళ్లీ తెలుగులో కూడా హీరోయిన్ ప్రూవ్ చేసుకుంది రకుల్. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు సరసన కూడా నటించి తెలుగులో మంచి హిట్స్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా బిజీగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రాజా షాబ్ అనే సినిమాను చేస్తున్నాడు. నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మోసం పిక్చర్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను హర్రర్ కామెడీ జోనర్ లో మారుతి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.


Related News

Sai Pallavi: ఆ హీరోలు అందరూ ఉనికిని కోల్పోతారు… సాయి పల్లవి నుంచి షాకింగ్ కామెంట్స్..!

Rajasaab: ప్రభాస్ తాత గెటప్ వెనుక ఇంత కథ ఉందా.. మారుతి ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Tripti Dimri : యానిమల్ బ్యూటి చేసిన మొదటి యాడ్?..అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..

Naga Vamshi : ఆ హీరోల పరువు అడ్డంగా తీసేసిన నిర్మాత.. నమ్మించి ముంచడం అంటే ఇదే..

Balayya : ఇదెక్కడి పిచ్చి మామా .. బాలయ్య పండక్కి సెలవు కావాలట..!

Love Reddy: థియేటర్లో నటుడిపై మహిళ దాడి..ఇంత వైలెంట్ ఏంటి భయ్యా..

Mokshagna: వారసుడు కోసం వారసురాళ్లే కావాలా.. వర్మ.. ?

Big Stories

×