Megastar.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. 2024 ఏడాది పద్మ విభూషణ్ అవార్డు వరించగా.. ఇటీవల అక్కినేని శతజయంతి సందర్భంగా అక్కినేని అవార్డుకి కూడా ఎన్నికయ్యారు అంటూ అక్కినేని నాగార్జున (Nagarjuna ) ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) చేతులమీదుగా చిరంజీవికి అక్టోబర్ 28వ తేదీన నిర్వహించే అక్కినేని శతజయంతి వేడుకలలో అందజేయనున్నారు. ఇక ఈ రెండు సంతోషాలలో మునిగి తేలుతున్న నేపథ్యంలో మరో అద్భుతమైన గౌరవం లభించడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు . ఈ గౌరవం ఒక్క మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా పరిశ్రమకు అని చెప్పాలి. తాజాగా గిన్నిస్ రికార్డుల్లో పేరు సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
537 పాటల్లో 24 వేల స్టెప్పులు..
డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్ తో డాన్స్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే 156 మూవీలలో 537 పాటల్లో 24 వేల స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కడంతో మెగా అభిమానులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఈ గౌరవాన్ని ఆయన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) చేతుల మీదుగా అందుకోవడం గమనార్హం.
నెల రోజులుగా అలాంటి వ్యాధితో బాధపడుతున్న చిరు..
ఇదిలా ఉండగా ఇంతటి శుభ పరిణామం వేళ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్త అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. అదేమిటంటే గత కొన్ని రోజులుగా చిరంజీవి ఒక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకే స్టేజ్ మీదకు కూడా వెళ్లలేని పరిస్థితిలో అటు అమీర్ ఖాన్ ఇటు ఆయన మేనల్లుడు సాయి ధరంతేజ్ సహాయం చేసిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి చికెన్ గున్యా తో గత 25 రోజులుగా బాధపడుతున్నారట. ఈ విషయాన్ని యాంకర్ వెల్లడించారు.
నిన్నటి రోజున హైదరాబాదులో సాయంత్రం వేళ స్టార్ హోటల్లో చిరంజీవికి సంబంధించిన ఈవెంట్ ని చాలా గ్రాండ్గా నిర్వహించారు.. అయితే ఇక్కడికి కూడా చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నప్పటికీ హాజరు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ఈవెంట్ చేసిన హోస్ట్ చిరంజీవిని పైకి పిలుస్తూ.. గత 25 రోజులుగా చికెన్ గున్యా తో మెగాస్టార్ చిరంజీవి బాధపడుతూనే ఈవెంట్ కి వచ్చారు. ఇప్పుడిప్పుడే ఆయన కోరుకుంటూ మళ్ళీ అభిమానుల కోసం మన ముందుకు వచ్చారు అంటూ తెలిపింది. చిరంజీవి నీరసంగా ఈవెంట్ కి వచ్చినప్పటికీ ఫ్యాన్స్ కోసం యాక్టివ్ గా ఉంటూ ఈవెంట్ అంతా పాల్గొని సక్సెస్ చేశారు. దీంతో చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.