EPAPER

Mathu Vadalara 2: హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందిరోయ్..

Mathu Vadalara 2: హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందిరోయ్..

Mathu Vadalara 2: కొన్ని సినిమాలు యూత్ కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి ఎడిక్ట్ అయిన సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి రెండో కొడుకు శ్రీసింహ హీరోగా పరిచయమైన చిత్రం మత్తు వదలరా. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్లాప్ ఎంటర్ టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.


కమెడియన్ సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన  ఈ సినిమా 2019 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అసలు సత్య కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. దొంగతనం కాదు  తస్కరించుట  అనే డైలాగ్.. అయితే అప్పట్లో ఫేమస్ గా మారింది. ఈ సినిమా తరువాత శ్రీసింహా ఎన్ని సినిమాలు చేసినా ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయాడు. దాదాపు ఐదేళ్ల తరువాత ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ ప్రకటించారు.

తాజాగా ఈ సీక్వెల్  రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా  ప్రకటించారు. సెప్టెంబర్ 13 న  మత్తువదలరా 2 ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. దీంతో పాటు ఒక కొత్త పోస్టర్ ను  కూడా రిలీజ్ చేశారు.


ఇక ఈ పోస్టర్ లో శ్రీసింహా, సత్య గన్స్ పట్టుకోని కనిపించారు. వారి వెనుక బ్యాక్ గ్రౌండ్ లో హై ఎమర్జెన్సీ టీమ్ అనే పేరుతో ఉన్న  ఆఫీస్ కనిపిస్తుంది. దానికి, హీరోకు సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక మత్తు వదలరా 2 సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో శ్రీసింహా ఎలాంటి హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×