Maheshbabu-Trivikram movie : ఏ సినిమా షూటింగ్కి అయినా ప్రాణం హీరోల కాల్షీటే. ఆ హీరో కాల్షీట్ సాలిడ్గా దొరికితే నాన్స్టాప్గా పనిచేయడానికి రెడీ అంటుంది యూనిట్. ఇప్పుడు మహేష్ – త్రివిక్రమ్ సినిమా యూనిట్ కోసం షూ లేస్ టైట్ చేసుకుని షూటింగ్కి సిద్ధం అంటోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయిన కొన్నాళ్లకి మహేష్ తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్లోనే తండ్రి సూపర్స్టార్ కృష్ణ కన్నుమూశారు. తన ఇంట వరుస విషాదాలు జరుగుతుండటంతో 2022లో ఇక సినిమా షూటింగులు చేయనని చెప్పేశారు మహేష్.
రీసెంట్ గా దుబాయ్ వెళ్లారు. అక్కడి నుంచి యుఎస్కి వెళ్లారు.న్యూ ఇయర్లో మరే డీవియేషన్ లేకుండా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ పూర్తి అయ్యీ కాగానే, వెంటనే షూటింగ్ స్పాట్కి వచ్చేస్తాను. ఫ్రెష్గా మొదలుపెట్టేద్దాం అని త్రివిక్రమ్కి సమాచారం పంపేశారట మహేష్. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ యూనిట్ అంతా షెడ్యూల్స్, కాల్షీట్స్, లొకేషన్స్ అంటూ అన్నిటినీ ఫైనలైజ్ చేసుకుంటోంది. ఈ మధ్య కొన్నాళ్లుగా రెస్ట్ తీసుకుంటున్న పూజా హెగ్డే కూడా ఫిట్ అయ్యారు. ఫస్ట్ మహేష్ – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తి చేశాక, మిగిలిన షూటింగులకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు పూజా హెగ్డే. గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు పూజా హెగ్డే.
2023లో మహేష్ – త్రివిక్రమ్ సినిమా తనకు పెద్ద బ్యాంగ్ అవుతుందనే హోప్స్ తో ఉన్నారు. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. స్క్రిప్ట్ ని కూడా త్రివిక్రమ్ ఇంకో సారి చూసుకున్నారని టాక్. ఏక్దమ్ 60 రోజుల షూటింగ్ అంటే, యూనిట్ అంతా ఆ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.