Mahesh Babu: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు వేసిన విషయం తెల్సిందే. కేవలం 100 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఉందని.. నిర్దాక్షిణ్యంగా ఆమెను ఫైనల్ నుంచి తప్పించారు. దీంతో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెస్తుంది అని భావించిన భారతీయుల గుండెలు బాధతో నిండిపోయాయి.
ఇక వినేశ్ ఫోగాట్ కు అండగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా నిలబడుతున్నారు. ఆమెకు ధైర్యం చెప్తూ సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఇప్పటికే సమంత, తాప్సీ లాంటి హీరోయిన్స్.. వినేశ్ ఫోగాట్ కు ధైర్యం చెప్తూ పోస్టులు చేశారు. తాజాగా మహేష్ బాబు సైతం ఆమెకు అండగా నిలబడ్డాడు. వినేశ్ ఫోగాట్.. మీరు నిజమైన ఛాంపియన్ అని ఎక్స్ లో ట్వీట్ చేశాడు.
” నేటి ఫలితంతో పట్టింపు లేదు, కానీ మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనమే. వినేశ్ ఫోగాట్.. మీ హృదయం నిజమైన ఛాంపియన్ అని మీరు అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం మరియు బలం మా అందరికీ స్ఫూర్తినిస్తాయి. పతకం వచ్చిందా లేదా అని కాదు, మీ స్ఫూర్తి మాలో.. ప్రతి ఒక్కరిలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. 1.4 బిలియన్ హృదయాలు మీతో పాటు ఉన్నాయి” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మహేష్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటి సారి ఈ కాంబో తెరపై కనిపించనుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
Today’s outcome doesn't matter, but your greatness in how you coped with the decision does 👏👏👏#VineshPhogat, you’ve shown everyone that your heart is that of a true champion; your resilience and strength to stand tall in difficult times inspires us all.
Medal or not, your…
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2024