Madhusudan Rao: ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు మధుసూధన్ రావు. తాజాగా ఈ నటుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆయనను విలన్గా ఓ డైరెక్టర్ గుర్తించినట్లు తెలిపాడు. అయితే ఓ సినిమాలో తన నటన చూసి చాలామంది బాగా చేశావ్ అన్నారే కానీ.. ఏ ఒక్కరు కూడా అవకాశాలు ఇవ్వలేదని తెలిపాడు. అంతేగాక ఆయన కుమారుడు తనకు తెలియకుండానే ఓ సినిమా చేసి షాక్ ఇచ్చాడని వెల్లడించాడు. ఇంతకీ ఆయన్ను విలన్గా గుర్తించిన డైరెక్టర్ ఎవరు?.. ఆయన కుమారుడు తీసిన సినిమా పేరేంటి? అనే విషయానికొస్తే..
కింగ్ నాగార్జున హీరోగా ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో విలన్గా నటించిన మధుసూధన్ రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. తనను విలన్గా గుర్తించిన డైరెక్టర్ దేవ కట్టా అని అన్నాడు. ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా తర్వాత తన దశ మారిపోయిందని తెలిపాడు. అయితే ఆ మూవీలో తన నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పారే తప్ప.. ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని అన్నాడు.
అయితే ఈ నటుడికి ఇద్దరు కుమారులు. అందులో ఒక కుమారుడు ప్రీతం.. తనకు తెలియకుండానే సినిమా చేశాడని అన్నాడు. ఆ సినిమా పేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అని తెలిపాడు. ఇక సినిమా మొత్తం పూర్తయిన తర్వాతనే తనకి చెప్పాడని.. దీంతో ఒక్కసారిగా తాను షాక్ అయ్యానని తెలిపాడు. తన కళ్ళముందే ఎదుగుతున్న కుమారుడు ప్రీతంను చూసి ఆనందం పట్టలేక ఏడ్చేశానని చెప్పుకొచ్చాడు.