SSMB29: మహేశ్బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా. జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ తరహాలో మూవీ. పాన్ ఇండియా పరిధి దాటేసి.. ప్రపంచస్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. యాక్షన్, అడ్వెంచర్ జోనర్లో సినిమా ఉండబోతోందని అంటున్నారు. ఒక్కో అప్డేట్తో SSMB29 పై అంచనాలు పీక్స్కు చేరుతున్నాయి.
లేటెస్ట్గా మరో అప్డేట్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఇంట్రడక్షన్ సీన్ దాదాపు 20 నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. ఆ సీన్లో మహేశ్బాబు కూతురు సితార, ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ను అక్కాతమ్ముళ్లుగా చూపించనున్నారని లీకులు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. తారక్ కొడుకు మొదటిసారి సిల్వర్ స్క్రీన్పై కనిపించినట్టవుతుంది. తాజా అప్డేట్తో మహేశ్, తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.