Krishna Rama Review : రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కృష్ణారామా’. ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించగా.. వెంకట కిరణ్, హేమ మాధురి నిర్మించారు. ఇందులో అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, జెమిని సురేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ‘ఈటీవీ విన్’లో అక్టోబరు 22 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
కథ
రామతీర్థ (రాజేంద్ర ప్రసాద్), కృష్ణవేణి (గౌతమి) దంపతులు. ఇద్దరూ రిటైర్డ్ టీచర్స్. వాళ్ల ముగ్గురు పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతారు. ఓ ఫేస్బుక్ అకౌంట్ కూడా తెరుస్తారు. కట్ చేస్తే.. దంపతులు ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆఖరికి సూసైడ్ వరకు వెళ్తారు. ఈ తర్వాత ఏమైంది? వాళ్లెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
భార్యభర్తల పాత్రలో రాజేంద్ర ప్రసాద్, గౌతమి ఒదిగిపోయారు. సాఫీగా సాగుతున్న జీవితంలోసోషల్ మీడియా వల్ల పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ అక్కడక్కడ కాస్త సాగధీతగా అనిపిస్తుంది.