Kiraak RP: జబర్దస్త్ షో గురించి రెండు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ టాలీవుడ్ కు దొరికారు. గెటప్ శ్రీను, సుడిగాలి సుధాకర్.. అంతెందుకు ఇప్పుడు మత్తు వదలరా 2 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సత్య కూడా జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్స్ చేసి వచ్చినవాడే. ఇక అలా ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కిర్రాక్ ఆర్పీ. జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా మంచి మంచి ఎపిసోడ్స్ చేసి మెప్పించిన కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్ ను వదిలి ఫుడ్ బిజినెస్ లోకి దిగాడు.
నెల్లూరు చేపల పులుసు అనే పేరుతో ఫుడ్ స్టాల్ ను ఓపెన్ చేసి.. మంచి ఫుడ్ అందిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ఇక వ్యాపారం బాగా పెరగడంతో అతని గుర్తింపు కూడా పెరిగింది. దీంతో ఆర్పీ.. రాజకీయాల్లోకి దిగాడు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కిర్రాక్ ఆర్పీ చేసిన ప్రచారం వలన వైసీపీ చాలా నెగెటివిటీని ఎదుర్కొంది. ముఖ్యంగా వైసీపీ మినిస్టర్ రోజాను.. కిర్రాక్ ఆర్పీ ఏకిపారేసిన తీరు ఆకట్టుకుంది. ఆమె నోరుకు అడ్డుఅదుపు లేదని, పవన్ కళ్యాణ్ కే పై నోరు పారేసుకోవడం వలనే వైసీపీ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
అంతేనా అసలు రోజా వలనే వైసీపీ ఓడిపోయిందని అని విమర్శించాడు. ఇక జనసేన గెలిచాక.. కిర్రాక్ ఆర్పీ, రోజాను వదిలేసి అల్లు అర్జున్ పై పడ్డాడు. ఇక చాలా గ్యాప్ తరువాత తిరుపతి లడ్డూ వివాదంలో మరోసారి రోజాపై విమర్శలు గుప్పించాడు. ఆమె ఒక మాజీ మంత్రి అన్న విషయాన్నీ మరిచి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు.
రోజా తిరుపతి అమ్మాయి అని చెప్పుకొస్తున్నది. ఆవిడ వయస్సు ఎంత.. ? ఆవిడ అమ్మాయి ఏంటి. మా అమ్మ కన్నా రెండేళ్లు పెద్ద.. అమ్మాయి అని చెప్పుకొస్తుంది. అసలు ఆమెలో ఆడతనం అనేది ఉందా.. ? అసలు ఆడ మనిషిలా ఆమె ప్రవర్తించిందా.. ? అని మొదలుపెట్టి .. తిరుపతి లడ్డూలో కలిపింది ఆమె కొవ్వే అని మాట్లాడాడు.
” రోజా కొవ్వునే తిరుమల లడ్డూలో వాడారు. ఎందుకంటే నా దృష్టిలో రోజా ఒక పందితో సమానం. అందుకే రోజా కొవ్వునే తిరుమల లడ్డూలో వాడారు. అందుకే రోజా సంబరపడుతుంది. నా కొవ్వునే.. జంతువు కొవ్వునే లడ్డూలో వాడారని, నీ కొవ్వు .. అడ్డగోలుగా సంపాదించినదంతా దేవుడు కరిగిస్తాడు” అని మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరీ ఇంత దారుణంగా ఒక ఆడ మనిషిని,అందులోనూ ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఇలా మాట్లాడడం పద్దతి కాదని, ఒకప్పుడు జబర్దస్త్ లో అమ్మా.. రోజమ్మ అన్న కిర్రాక్ ఆర్పీ.. ఇప్పుడు ఆమెను పంది అని తిట్టడం కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై రోజా ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.