Kiara-Sidharth: బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీలు వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జైసల్మేర్లో వీరి వివాహం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. తాజాగా ఈ జంట బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలోని ఓ స్థార్ హోటల్లో గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేసింది. ఆదివారం సాయంత్రం 8 గంటలకు ఈ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు బాలీవుడు తారలు.. అజయ్ దేవగణ్-కాజోల్ దంపతులు, షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్, కరీనా కపూర్, కరణ్ జోహార్, భూమి పెడ్నేకర్, నీతూకపూర్, అలియాభట్, ఆదిత్యారాయ్ కపూర్, అనన్యపాండేలతో పాటు పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇక 2021లో వచ్చిన షేర్షా మూవీ షూటింగ్ సమయంలో కియారా అద్వానీ-సిద్ధర్థ్ మల్హోత్రాలు కలుసుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య పరియం ఏర్పడింది. కొద్దిరోజులకు అది ప్రేమగా మారింది. రెండు సంవత్సరాల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఇటీవల ఇరుకుటుంబాలను ఒప్పించి ఒక్కటైంది.