కేరళలో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. ఈ మేరకు వయనాడ్తో పాటు ముండకై, సురల్ మలై, అట్టమలై, నుల్ పుజా వంటి ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా ఈ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
ప్రధానంగా వయనాడ్ లోని మూడు గ్రామాలు మట్టిలో కూరుకుపోయాయి. ఈ ఘటనలో 285మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 240 మంది ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రజల ఆచూకీ తెలుసుకునేందుకు రెస్క్కూ టీమ్..పగలు, రాత్రి భారీగా సహాయక చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు కేరళకు తమ సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రమ్, విజయ్, హీరో సూర్య, జ్యోతిక, కార్తీ, విక్రమ్ తో సహా చాలామంది కోలీవుడ్ సినీ తారలు ఆర్థిక సాయం చేశారు. తాజాగా, హీరోయిన్ నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు భారీగా విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. తినేందుకు కనీసం తిండి కూడా దొరకని పరిస్థతి నెలకొంది. ఇందులో భాగంగా నయనతార దంపతులు కేరళ కోసం విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా ఒక నోట్ విడుదల చేశారు.
Also Read: దేవర సెకండ్ సింగిల్ పోస్టర్.. రొమాంటిక్ యాంగిల్ లో ఎన్టీఆర్, జాన్వీ
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తమ వంతుగా రూ.20 లక్షలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళలో భారీ వర్షాలకు నష్టపోయిన బాధితుల కష్టాలను చూస్తుంటే..గుండె బరువెక్కుతున్నట్లు తెలిపారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ లో సహాయక చర్యలు చేపడుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.