Kangana Ranaut As A Powerful Woman In Emergency Trailer:
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ. ఈ మూవీ ట్రైలర్ బుధవారం రిలీజ్ అయింది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పొలిటికల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ప్రధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరాగాంధీ రోల్లో కంగన కనిపించనున్నారు. ఇక ఈ మూవీలో మెయిన్ రోల్లో యాక్ట్ చేయడమే కాకుండా ఈ మూవీకి కంగనా స్వయంగా డైరెక్ట్ చేశారు.
ఇక ఈ మూవీలో జయప్రకాశ్ నారాయణ్ రోల్లో నటుడు అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి రోల్లో బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడే నటిస్తున్నారు. ఇక ఈ మూవీని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read: కమిటీ కుర్రాళ్ల టీమ్పై టాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు
ఇక ఈ మూవీ చాలా రోజుల కిందటే షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీ మరింత లేట్ అవుతూ వస్తోంది. పలు రకాల కారణాల మూలంగా అనేకసార్లు మూవీ షూటింగ్ పోస్ట్పోన్ అవుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు అన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని సెప్టెంబర్ నెలలో ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఇక గతంలో దివంగత తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తలైవీ అనే మూవీని తెరకెక్కించారు. అయితే అందులో కంగనా జయలలిత రోల్లో కనిపించి మంచి ఐడెంటీటీ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె నటిించిన ఈ మూవీపై భారీ హైప్ని క్రియేట్ చేస్తున్నాయి ఫ్యాన్స్లో మరి చూడాలి ఇందులో కంగనా ఎంతలా ఆకట్టుకుందో..