K. Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంట నెలరోజుల వ్యవధిలోనే మరో విషాదం చోటుచేసుకుంది. కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయస్సు 86 ఏళ్లు. జయలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించిన కాసేపటికే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
ఫిబ్రవరి 2న కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన మరణించిన 24 రోజులకే భార్య జయలక్ష్మి కూడా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన తర్వాత నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కూడా కన్నుమూశారు.