junior ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలలోనే కాదు.. బయట కూడా అందరితో సరదాగా ఉంటారు. తనతో పాటు తన చుట్టూ ఉండే వారిని బాగా నవ్విస్తూ ఉంటారు. మరి అలాంటి నటుడికి టాలీవుడ్ డైరెక్టర్కి మధ్య ఓ సినిమా విషయంలో మాటల యుద్ధం జరిగి.. ఇప్పటికీ వారిద్దరూ మాట్లాడుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ఆ డైరెక్టర్ ఎవరు?.. వారి మధ్య జరిగిన సంఘటన ఏంటి అనే విషయానికొస్తే..
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ‘దేవర’ మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్కి సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది. ఓ సినిమా విషయంలో తలెత్తిన వివాదం వల్ల ఎన్టీఆర్- దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికీ మాట్లాడుకోవటం లేదని అంటున్నారు. ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం దమ్ము. అప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ ఫ్లాప్ అందుకొని దారుణమైన ట్రోలింగ్కు గురైంది.
దీంతో ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్కు బోయపాటికి మధ్య మాటల యుద్దం మొదలయిందని తెలుస్తోంది. అయితే దీనికి కారణం ఏంటంటే?.. ముందుగా ఎన్టీఆర్కి చెప్పిన దమ్ము మూవీ కథ ఒకటని.. బోయపాటి తీసిన కథ మరొకటి అంటూ గుస గుసలు వినిపించాయి. దీని కారణంగానే ఈ సినిమా ఫ్లాప్ అయిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇందులోని కొన్ని మార్పులు కూడా ఎన్టీఆర్కు చెప్పకుండా బోయపాటి చేశారని టాక్. దీంతో బోయపాటి మీద ఎన్టీఆర్ చాలా కోపంతో ఫైర్ అయినట్లు సమాచారం. అప్పటి నుంచి వీరిద్ధరి మధ్య మాటలు లేవని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ కూడా స్పష్టతనివ్వలేదు.