Jr NTR : టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ దగ్గర పండగేనని చెప్పాలి. అలాంటి స్టార్ డమ్ ఉన్న హీరోకి సినిమా పరంగా దారుణమైన అవమానం ఎదురైంది. ఇది వింటే అవునా! అని అనిపించక మానదు. వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ఆంధ్రావాలా. దీనికి పూరి జగన్నాథ్ దర్శకుడు. సింహాద్రి తర్వాత భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్కి ఇది ఒక మచ్చలా మిగిలిపోయిందంటే ఎవరూ కాదనలేదు. అంత గొప్ప వెర్సటైల్ యాక్టర్ ఈ సినిమాను ఎందుకు చేశారా? అని ఫ్యాన్స్ ఇప్పటికీ కుమిలి పోతుంటారు.
అయితే ఈ సినిమా మరోసారి ఎన్టీఆర్ అభిమానులకు దారుణమైన చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఆంధ్రావాలా చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. అయితే అప్పుడు ఎలాంటి ఫలితం ఎదురైందో ఇప్పుడు దాని కంటే ఘోరమైన సిట్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆంధ్రావాలా స్పెషల్ షోస్ తొలిరోజు కలెక్షన్స్ అంటూ.. సీడెడ్లో రూ. 480, ఆంధ్రాలో రూ. 460, నైజాంలో రూ. 60 అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నోరు మెదపటం లేదు.
మరో వైపు చరణ్ డిజాస్టర్ మూవీ ఆరెంజ్ రీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఇప్పుడు వసూళ్ల ఓ రేంజ్లో రాబడుతుంది. నాగబాబు, డైరెక్టర్ భాస్కర్ సహా అందరూ ఆరెంజ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి షాక్ అవుతున్నారు మరి. మరో వైపు ఎన్టీఆర్కి ఆంధ్రావాలా దారుణమైన అవమానాన్ని మిగిల్చిందని నెటిజన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ సినిమాలు ఇన్ని ఉండగా … అసలు ఆంధ్రావాలాను రీ రిలీజ్ చేయాలని ఎందుకు అనుకున్నారో ఆయన ఫ్యాన్సే చెప్పాలి మరి.
for more updates follow this :BIGTV