Jr NTR:- యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్పై ఫోకస్ పెట్టేశారు. ఆయన తన మార్కెట్ను టాలీవుడ్తో పాటు ఉత్తరాదిన కూడ పెంచుకోవటానికి అడుగులు వేస్తన్నారు. అందులో భాగంగా వార్ 2 సినిమాలో నటించటానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ నిర్మించబోయే వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ను తారక్ ఢీ కొట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది. అయితే టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్.. వార్ 2 లో నటించటానికి భారీ రెమ్యునరేషన్నే తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు వార్ 2లో ప్రతినాయకుడిగా నటించటానికి ఎన్టీఆర్ ఏకంగా రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ను తీసుకుంటున్నారు. ఇది ఆయన కెరీర్లోనే హయ్యస్ట్ పారితోషకం అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఆ రేంజ్ రెమ్యూనరేషన్స్ అందుకోలేదని టాక్. ఇప్పుడు వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే అతి కొద్ది మంది హీరోల క్లబ్లోకి ఎన్టీఆర్ చేరారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ 30 చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఓ బాలీవుడ్ స్టార్ కూడా విలన్గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 సినిమా ఉంటుంది. ఈ గ్యాప్లో ఎన్టీఆర్ .. హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమాను పూర్తి చేస్తారు. ఒక వైపు హీరోగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తూనే బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర కావటానికి ఎన్టీఆర్ ప్లాన్ చేసేసుకున్నారు.
రూ.100 కోట్ల దసరా.. నాని రికార్డ్.. డైరెక్టర్కి BMW గిఫ్ట్.. యూనిట్కు గోల్డ్ కాయిన్స్
for more updates follow this link:-Bigtv