Priyanka Mohan:గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది.. తెలుగు కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తరువాత పలు సినిమాలు చేసి మెప్పించిన ప్రియాంక.. ఈ మధ్యనే సరిపోదా శనివారం సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. అంతేకాకుండా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన OG లో నటించే ఛాన్స్ పట్టేసింది. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇక ఈ నేపథ్యంలోనే ప్రియాంక మోహన్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అది కూడా ఈ మధ్యనే విడాకులు తీసుకున్న స్టార్ హీరో జయం రవితో ఆమె నిశ్చితార్థం గోవాలో చాలా సింపుల్ గా జరిగిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక దానికి రుజువుగా వారిద్దరూ దండలు మార్చుకున్న ఫోటోను షేర్ చేస్తున్నారు. దీంతో ప్రియాంక మోహన్ ను నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. నీకు ఇంకెవరు దొరకలేదా.. ? అప్పుడే పెళ్లి చేసుకోవడం ఏంటి.. ? అని కామెంట్స్ పెడుతున్నారు.
ఇంకోపక్క జయం రవిపై కూడా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఈ మధ్యనే జయం రవి.. తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఆమె మాత్రం తన భర్త తన ప్రమేయం లేకుండా విడాకులు ప్రకటించినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ ఎంగేజ్మెంట్ నిజం కాదు. జయం రవి, ప్రియాంక మోహన్ కలిసి బ్రదర్ అనే మూవీ చేస్తున్నారు. అందులో భాగంగా జరిగిన ఒక సాంగ్ షూట్ లో ఫోటోను ఇలా షేర్ చేసి.. ప్రియాంక ఎంగేజ్మెంట్ అని చెప్పుకొస్తున్నట్లు కోలీవుడ్ మీడియా తెలిపింది.
ప్రస్తుతం ప్రియాంక మోహన్.. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిందని, అక్కడ ఆమె ఒక ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందని తెలుస్తోంది. ఇకపోతే బ్రదర్ సినిమా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ ఏడాది సరిపోదా శనివారం తో హిట్ ఖాతా తెరిచిన ప్రియాంక మోహన్.. బ్రదర్ తో ఇంకో హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.