EPAPER

Jani Master : జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్… భార్యే పోలీసులకు పట్టించిందా?

Jani Master : జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్… భార్యే పోలీసులకు పట్టించిందా?

Jani Master : పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు నిమిషానికో టర్న్ తిరుగుతోంది. తాజాగా జానీ మాస్టర్ అరెస్టు విషయంలో ఆయన భార్యే కీలక పాత్ర పోషించింది అనే విషయం బయటకు వచ్చింది. పోలీసులకు జానీ మాస్టర్ ను స్వయంగా ఆయన భార్యే పట్టించింది అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలేం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…


జానీ మాస్టర్ ను పట్టించిన భార్య

అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ అరెస్టు కాబోతున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో పరారయ్యారు. దీంతో పోలీసులు సపరేట్ గా టీములు పెట్టి మరీ అతన్ని వెతికే పనిలో పడ్డారు. ఎట్టకేలకు అతను గోవాలో ఉన్నాడు అనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఒక లాడ్జిలో శేఖర్ మాస్టర్ పోలీసుల చేతికి చిక్కారు. మరోవైపు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ భార్య ఆయేషా రచ్చ చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. జానీ మాస్టర్ భార్య స్వయంగా తన భర్తను పట్టించిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని ఎస్ఒటి పోలీసులకు చెప్పి, పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంలో సహాయం చేసిందట. అయితే ఈ విషయం తెలిసిన నెటిజెన్లు తప్పు చేయని వ్యక్తి ఎందుకు పారిపోయాడు? అసలు భార్యనే అతన్ని పట్టించడానికి గల కారణమేంటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.


Jani Master : భర్త అరెస్ట్…  పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ భార్య..

పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ భార్య రచ్చ…

ప్రస్తుతం టాలీవుడ్ లో దుమారం రేపుతున్న జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గోవాలోని ఓ లాడ్జ్ లో జానీ మాస్టర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని అక్కడి కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్ కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అంతలోనే జానీ మాస్టర్ భార్య ఆయేషా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రచ్చ రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మాస్టర్ భార్య ఆయన ఎక్కడ ? తనను చూడాలి అంటూ రచ్చ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ ఉన్నాడు అంటూ ఫేక్ కాల్ రావడంతో ఆమె అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిజం ఏంటో చెప్పిన పోలీసులు ఆమెకు సర్ది చెప్పి పంపించారు. తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ ఇంకా హైదరాబాద్ కు చేరుకోలేదని, గోవా నుంచి సిటీకి చేరుకోవడానికి ఇంకా టైం పడుతుందని చెప్పినట్టు సమాచారం. ఇక ఈ విషయం గురించి జానీ మాస్టర్ భార్య ఆయేషా మీడియాతో మాట్లాడడానికి నిరాకరించింది. కానీ ఫేక్ కాల్ రావడంతో విషయం ఏంటో కనుక్కోడానికే తను పోలీస్ స్టేషన్ కు వచ్చాను అని చెప్పింది. బాధితురాలు ఇచ్చిన కంప్లయింట్ లో జానీ మాస్టర్ తో పాటు ఆయేషా పేరు కూడా ఉందన్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ ను నేరుగా ఉపర్పల్లి కోర్టులో పోలీసులు హాజరు పరిచే ఛాన్స్ ఉంది.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×