Jani Master: టాలీవుడ్ లో సార్ బెస్ట్ కొరియోగ్రాఫర్ల లిస్ట్ లో జానీ మాస్టర్ పేరు టాప్ 5 లో ఉంటుంది. ఒక సాధారణమైన కంటెస్టెంట్ గా డ్యాన్స్ షోలో పాల్గొని.. ఎన్నో అవమానాలను భరించి డ్యాన్స్ మాస్టర్ గా మారాడు. తన స్టెప్స్ తో స్టార్ హీరోలను మెప్పించి స్టార్ కొరియోగ్రాఫర్ గా మారాడు. అంతేకాకుండా ఈ మధ్య రన్నర్ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇక సినిమాలు కాకుండా .. గత కొన్నేళ్లుగా జానీ మాస్టర్ ఢీ అనే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ అనే థీమ్ తో నడుస్తోంది. ఇందులో కొంతమంది సినీ, సీరియల్స్ లో ఉండే నటులు డ్యాన్స్ తో తమలోని మరో టాలెంట్ ను బయటపెడుతున్నారు. డ్యాన్స్ షూ అంటే ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది. ప్రతి వారం ఒక్కొక్కరిగా వెళ్తూ ఉంటారు. తాజాగా ఎలిమినేషన్ రౌండ్ లో జరిగిన ఒక సంఘటన.. జానీ మాస్టర్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఈ వారం టాప్ బాటమ్ లో ఉన్న కంటెస్టెంట్స్ సాత్విక్, సునంద ఉన్నారు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ ఓటు వేసి.. ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఇక అలా జరుగుతున్న క్రమంలో నారప్ప సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి పేరు తెచ్చుకున్న రాకీ.. సాత్విక్ కు సారీ చెప్పి సునందకు ఓటు వేస్తాడు.
ఇక వెంటనే జానీ మాస్టర్ కలుగజేసుకొని.. ఈ స్టేజి ఎంతో గొప్పది.. ఒక జీవితం.. మీరు వేసే ఒక ఓటు వారి లైఫ్ ను కాపాడుతుంది.. ఖచ్చితమైన రీజన్ చెప్పి ఎలిమినేట్ చేయండి అనగానే.. రాకీ లేచి.. సాత్విక్ అన్న కళ్లతో సైగలు చేసి.. సునంద అక్కకు ఓటు వేయమని చెప్పాడు. అందుకే వేశాను అని చెప్పగానే జానీ మాస్టర్ .. ఇది మోసం కాదా..? మేము ఇక్కడ ఉన్నది ఎందుకు.. ? అంటూ ఫైర్ అయ్యాడు. ఎర్రిపప్పలా కనిపిస్తున్నామా.. ? అని సెట్ నుంచి వెళ్ళిపోయాడు. ఎవడో సైగ చేశాడు అంట.. వీడు ఇచ్చాడు అంట.. ఢీ షో ఎలా కనిపిస్తుంది మీకు.. ఒక్కొక్కడు లైఫ్ ఇది.. ఏదైనా మిస్ అయితే.. ఢీ అంటే ఆటలుగా అనిపిస్తుందా.. ? అంటూ కోపంతో ఊగిపోయాడు. మైక్ ను పగులకొట్టి సెట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.