Janhvi Kapoor latest news(Today tollywood news): బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు ఎంత అందాల ఆరబోత చేసినా ఆమె భక్తికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు. ఆమె ఎంత అందాల ఆరబోత చేసినా.. ఆమె ప్రతి నెలలో ఒకసారి అయినా తిరుమలలో సందడి చేస్తూ ఉంటుంది.
ఇక ఎప్పుడు వెళ్లినా వెళ్లకపోయినా.. ఆమె తల్లి శ్రీదేవి జయంతి రోజున కచ్చితంగా తిరుమల వెళ్లి పూజలు చేయిస్తుంటుంది. ఇక ఈరోజు శ్రీదేవి జయంతి కావడంతో జాన్వీ.. తిరుమలకు వెళ్లి పూజలు నిర్వహించింది. జాన్వీతో పాటు ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా కనిపించడంతో అందరూ చూపు ఈ జంట మీదనే పడింది. చీరలో జాన్వీ.. పంచె కట్టులో శిఖర్ ఎంతో చూడముచ్చటగా కనిపించారు.
గత కొన్నేళ్లుగా జాన్వీ.. శిఖర్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి రిలేషన్ గురించి జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జాన్వీ ఎప్పుడు తిరుమల వెళ్లిన పక్కన శిఖర్ కనిపిస్తూనే ఉన్నాడు. నేడు తిరుమలలో మెట్లదారి గుండా స్వామివారి సన్నిధానానికి చేరుకొని, తల్లి జయంతిని గుర్తుచేసుకుంది.
ఇక జాన్వీ తల్లి శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ.. ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ అయ్యింది. “హ్యాపీ బర్త్ డే మమ్మ.. ఐ లవ్ యూ” అని చెప్పుకొచ్చింది. శ్రీదేవితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక జాన్వీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం దేవర సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇది కాకుండా RC16 లో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో జాన్వీ.. తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
मां श्रीदेवी के जन्मदिन के मौके पर अभिनेत्री जान्हवी कपूर ने तिरुपति बालाजी मंदिर में पूजा-अर्चना की। #JanhviKapoor #tirupatibalaji #shridevi #bollywood #entertainment pic.twitter.com/gOCGsrLOcR
— Manchh (@Manchh_Official) August 13, 2024