IIleyana Dcruz:గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడంటే సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. కానీ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఎంతలా అంటే కొన్ని సందర్భాల్లో హీరోల కంటే ఆమె రెమ్యునరేషనే ఎక్కువగా ఉండేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. అలాంటి స్టార్ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది. తెలుగు, తమిళ చిత్రాలను పక్కన పెట్టి బాలీవుడ్ సినిమాల వైపు పరుగులు తీసిన ఈ అమ్మడుకి అక్కడ నిరాశే ఎదురైంది. దీంతో అటు బాలీవుడ్లోనూ సినిమాలు లేవు.. ఇటు సౌత్లోనూ ఆదరించే వారు కరువయ్యారు.
సోషల్ మీడియాలో మాత్రం ఇలియానాను ఫ్యాన్స్ ఆమెను బాగానే ఫాలో అవుతున్నారు. అలాంటి వారు షాకయ్యే విషయాన్ని ఇలియానా తెలియజేసింది. అదేంటంటే ఆమె అస్వస్థతకు లోనైంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా స్టోరి ద్వారా తెలియజేసింది. ఆహారం తీసుకోలేదని, దాంతో డాక్టర్స్ మూడు బాటిల్స్ సెలైన్ ఎక్కించారని ఇలియానా తెలియజేసింది. అంతే కాదు.. చేతికి సెలైన్ ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. డాక్టర్స్ తనను బాగా ట్రీట్ చేస్తున్నారని, మూడు బ్యాగ్స్ ఐవీ లిక్విడ్స్ కూడా ఇచ్చినట్లు ఆమె తెలియజేసింది. ఇలియానా త్వరగా కోలుకోవాలని ఫాలోవర్స్, నెటిజన్స్ మెసేజ్లు పెడుతున్నారు.