Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్తేమి కాదు.. ఇప్పటివరకు ఆయన ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నారు. ఈ ఏడాదే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. ఇక తాజాగా చిరు మరో అరుదైన గౌరవం కూడా అందుకోనున్నారు. ప్రస్తుతం IIFA( ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) 2024 వేడుకలకు రంగం సిద్దమైన విషయం తెల్సిందే.
సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అబుదాబీలో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజర్ నిన్న మాదాపూర్ లో ఘనంగా జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరోలు, హీరోయిన్స్ తో ఈ వేడుక కళకళలాడిపోయింది. రానా, తేజ సజ్జా ఈసారి ఐఫా వేడుకకు హోస్ట్స్ గా మారారు. వచ్చినవారిని తమ మాటలతో అలరిస్తూ.. గెస్ట్ ల నుంచి మంచి మంచి సమాధానాలను రాబట్టారు.
ఇక ఈసారి ఐఫా.. మెగాస్టార్ ను అరుదైన గౌరవంతో సత్కరించనున్నట్లు తెలుస్తోంది. ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అనే అవార్డుతో ఆయనను సత్కరించనున్నారు. దీనికోసం చిరు.. దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన పాత్రలు, కథలు, నటనకు గాను ఈ గౌరవాన్ని అందించనున్నారట. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి.. విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలను పెట్టుకోనున్నారు. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.