Hero Ram Pothieni Double Ismart 2nd Single Releasing on 16th July: 2019లో టాలీవుడ్ హీరో రామ్,సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చింది ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీకి సీక్వెల్ గా త్వరలో డబుల్ ఇస్మార్ట్ రాబోతుంది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అనంతరం ఈ వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాక ఆగస్టు 15న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రామ్ సరసన హీరోయిన్ కావ్య థాపర్ నటిస్తుండగా..బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఈ మూవీలో విలన్గా చేస్తున్నాడు. పూరి నటి ఛార్మితో కలిసి కనెక్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ మూవీ నిర్మాణం జరుగుతోంది.
ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా పూరీ మూవీ అంటే మినిమం ఉంటుంది కాబట్టి ఈ మాస్ మూవీపై ఆడియెన్స్లో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగిపోతోంది. అంతేకాదు పూరి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీకి పదును పెడుతూ తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ గ్లింప్స్ సాంగ్ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకున్నారు మేకర్స్.ఇప్పుడు రెండో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.మార్ ముంత చోడ్ చింత అంటూ సాగే ఈ సాంగ్ని ఈనెల 16న రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ అనౌన్స్ చేశారు.
Also Read: సింగర్ చిన్మయి ఫైర్, సమాజం ఎటు పోతోందంటూ..
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో రామ్ లుక్ ఆధ్యంతం ఆడియెన్స్ని ఆకట్టుకుంది.ఈ పోస్టర్ లో రామ్ రెండు చేతుల్లో రెండు బాటిల్స్ పట్టుకొని మందు తాగుతున్నట్టుగా కనిపిస్తాడు. అంతేకాదు ఇందులో బ్యాక్ డ్రాప్లో ఉండే బ్యాక్గ్రౌండ్ అందరిని ఎంటర్టైన్ చేసేదిగా ఉండబోతోంది.ఇక ఇస్మార్ట్ శంకర్ మూవీ అంటేనే మాస్ ఊరమాస్గా ఆడియెన్స్లో ముద్ర పడిపోయింది. మరి ఈ మూవీతో పూరీ మరోసారి తన మాస్ మ్యానరిజాన్ని రామ్తో పుల్ఫిల్ చేస్తాడని టాలీవుడ్ ఆడియెన్స్ భావిస్తున్నారు. మరి ఈ మూవీ ఆడియెన్స్ అంచనాలను మించి ఉంబడబోతోందా అంటూ నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.