EPAPER

HarshaSai: సైబర్ క్రైమ్ లో కంప్లైంట్.. వికృత చేష్టలకు బాధిత యువతి ఎమోషనల్..!

HarshaSai: సైబర్ క్రైమ్ లో కంప్లైంట్.. వికృత చేష్టలకు బాధిత యువతి ఎమోషనల్..!

HarshaSai.. నాడు మహాత్మా గాంధీ అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగినప్పుడు దేశానికి సిసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని చెప్పారు. నాడు ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు అన్నారో తెలియదు కానీ ఇప్పటికీ ఆడవారికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లేదు అనే చెప్పాలి. ఒంటరిగా కనిపించినా.. పని ప్రదేశాలలో అయినా సరే లైంగిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ముఖ్యంగా మహిళ లేనిదే సమాజం నడవదు.. అలాంటి మహిళకు ఈ సమాజంలో స్వేచ్ఛ లేకపోవడం సిగ్గుచేటు.


ఆడవారికి స్వేచ్ఛ లభించదా..

ముఖ్యంగా సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో పేరు మోసిన వారు కూడా ఇలా ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడుతుంటే.. ఇక సామాన్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి నిమిషానికి కొన్ని వేల మంది ఆడవారు దేశవ్యాప్తంగా కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలా లైంగిక అత్యాచారాలకు గురవుతున్నారు.అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇవన్నీ బయటకు వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి కానీ ఇదే సోషల్ మీడియా లేకపోతే ఇవన్నీ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయేటివే.. అయితే అన్ని విషయాలను ఈ సోషల్ మీడియా తెలియజేస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి.. ఎన్నో చెప్పలేని బాధలు.. దుఃఖంతో గుండె బరువెక్కినా ఆ దుఃఖాన్ని కంటి వెనకే దాచేసి ముఖంపై నవ్వును చిందిస్తూ గడిపేస్తున్న జీవితాలెన్నో..


లైంగిక వేధింపుల కేసులో ఖైదీగా మారిన జాతీయ అవార్డు గ్రహీత..

ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు మరీ ఎక్కువగా ఉన్నాయని మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చాలామంది అమ్మాయిలు నేరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు సొంతం చేసుకుని, జాతీయ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ (Jani Master)కూడా ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం చంచల్గూడా జైల్లో రిమాండ్ లో ఉన్నారు.

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ హర్షసాయి పై కేసు ఫైల్..

మరోవైపు యూట్యూబర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న హర్ష సాయి (Harsha Sai)కూడా ఇలా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాధిత యువతి (సినీ నటి) హర్ష సాయి తన దగ్గర నుండి రూ .2కోట్లు తీసుకొని తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు మోసం చేశాడని లైంగికంగా తనపై అత్యాచారం కూడా చేశాడని, అంతేకాదు నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు హర్షసాయి తండ్రిపై కూడా కంప్లైంట్ చేసింది బాధిత యువతి. ప్రస్తుతం హర్ష సాయి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉండగా హర్ష సాయి పై మరో కంప్లైంట్ చేసింది బాధిత యువతి.

సైబర్ క్రైమ్ లో మరో కంప్లైంట్ ఇచ్చిన బాధిత యువతి..

తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో యూట్యూబర్ హర్ష సాయి పై కంప్లైంట్ చేసింది. సోషల్ మీడియాలో తనపై విచక్షణారహితంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని, ఉద్దేశపూర్వకంగానే తనపై ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నాడు అంటూ బాధిత యువతి ఆరోపించింది. తనపై వికృత చేష్టలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ ట్రోలింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువతి తన కంప్లైంట్ లో తెలిపింది. అందుకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లను కూడా పోలీసులకు సమర్పించింది. దీనితో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యువతీ తనపై జరుగుతున్న ట్రోలింగ్ కి ఎమోషనల్ అవుతూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరి దీనిపై పోలీసులు తదుపరి విచారణ ఏ విధంగా జరుపుతారో చూడాలి.

Related News

Brahmaji : బండ బూతులు తిట్టిన నెటిజన్… మధ్యలోకి ప్రభాస్ ను లాగుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బ్రహ్మాజీ

Roja Movie: ఈ హీరో జీవితంలో ఇంత విషాదమా.. కన్నీరు పెట్టిస్తున్న స్టోరీ..!

Genelia: అర్ధరాత్రి విడాకులు.. నా జీవితంలో ఊహించని పరిణామం..!

Big Tv Exclusive : RC16 షూటింగ్ కి అంతా సెట్… పూర్తి డీటైల్స్ ఇవే…

Rajinikanth: డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. కానీ..?

Jr. Ntr : ఇక్కడ సినిమాలకు బ్రేక్.. అక్కడ సినిమాలకు గ్రీన్ సిగ్నల్..

Big Stories

×