Guntur Kaaram: మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ను యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్లో ప్లాన్ చేశారు. కానీ అనుకొని విధంగా ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అక్కడ ఈవెంట్ను నిర్వహించడానికి పర్మిషన్ దొరకకపోవడంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేసుకున్నారు మేకర్స్.
అయితే ఈ ఈవెంట్లోనే ‘గుంటూరు కారం’ ట్రైలర్ను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించిందట. ఇప్పుడు ఈవెంట్పై సరైన సమాచారం లేకపోవడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేసింది. ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ రోజు ఈ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను వదిలింది. ఈ అప్డేట్తో మహేశ్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. కాగా ఈ భారీ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. కల్ట్ క్లాసిక్స్ అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడవ మూవీ ఇది కావడంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి.