Guntur Kaaram: మహేశ్ బాబు నటిస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మూవీ మేకర్స్ జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడా ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా.. 24 గంటల ముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినట్లు ప్రకటించడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించాలని మేకర్స్ భావించారు. అయితే సెక్యూరిటీ కల్పించడం సాధ్యం కాదని పోలీసులు అనుమతికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అందువల్లనే ఈవెంట్ రద్దయినట్లు సమాచారం. అయితే ఈ ఈవెంట్ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారు.. ఎక్కడ నిర్వహిస్తారు అనేది ప్రకటించలేదు. దీంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇంతకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? ఉండదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.